Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రేవంత్ రెడ్డి

Advertiesment
revanth reddy
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో రేవంత్ రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 
 
రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడో యాత్రకు వెళ్తుండగా యల్లారెడ్డిపేట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ఉన్న నాలుగు ఎస్‌యూవీలు, రెండు మీడియా వాహనాలు ధ్వంసమయ్యాయి. 
 
ఓ వాహనం డ్రైవర్‌ అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదటి వాహనాన్ని అనుసరిస్తున్న కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి. 
 
రేవంత్ రెడ్డితో పాటు ఎస్‌యూవీలో ఉన్న ఇతర వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. ఢీకొనడంతో ఈ వాహనాల్లోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం రేవంత్ రెడ్డి మరో వాహనంలో బయలుదేరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్తాన్‌లో 10 గ్రాముల ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు