Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ములుగులో ఆర్టీసీ బస్సుకు నిప్పు

ములుగులో ఆర్టీసీ బస్సుకు నిప్పు
, బుధవారం, 15 డిశెంబరు 2021 (11:49 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో గుర్తుతెలియని దండగులు ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. నైట్ హాల్టింగ్ చేసిన సమయంలో ఈ బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్టు తెలుస్తుంది. దీంతో బస్సు వెనుకభాగం స్వల్పంగా కాలిపోయింది. ఈ విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్‌లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. 
 
కాగా, రాత్రిపూట బస్సు నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు డ్రైవర్ కండక్టర్‌లను అప్రమత్తం చేసి వారిని బస్సు నుంచి కిందకు దించేశారు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిప్పు పెట్టిన దుండగుల కోసం గాలిస్తున్నారు. ఎవరైనా అకతాయిలు ఈ పని చేశారా లేక మావోయిస్టులా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో వైద్య కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి