Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మృగశిర కార్తె.. ఈ రోజు చేపలు తినాల్సిందే.. క్యూ కడుతున్న జనం

మృగశిర కార్తె.. ఈ రోజు చేపలు తినాల్సిందే.. క్యూ కడుతున్న జనం
, మంగళవారం, 8 జూన్ 2021 (10:07 IST)
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చేపల మార్కెట్ వద్ద జనం క్యూ కడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇవాళ 'మృగశిర కార్తె'. ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని ప్రజలు భావిస్తారు. అందుకే ఈ రోజలు చేపలు తింటారు. ఈ రోజు మృగశిర కార్తె కావడంతో తెలుగు రాష్ట్రాల్లో చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రామ్ నగర్ చేపల మార్కెట్ అయితే తెల్లవారు జాము నుంచే ప్రజలు బారులు తీరారు. 
 
27 నక్షత్రాల్లోకి ఈ రోజు సూర్యుడి ప్రవేశం జరుగుతుంది. ఇలా జరగడాన్ని 'మృగశిర కార్తె'గా పిలుపుకుంటారు. అంతేకాదు ఈ కార్తె ప్రారంభంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. నిన్నటితో రోహిణీ కార్తె ముగిసింది. ఈ రోజు మృగశిర కార్తె ప్రారంభంకావడంతో తొలకరి వర్షాలు కురుస్తాయి. దీంతో రైతులు ఏరువాక లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాగళ్లతో పొలాలను దున్ని పంటలు వేస్తారు.
 
ఈ కార్తె సందర్భంగా చేపలు తినడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. వేసవి కాలం తర్వాత వాతావరణం చల్లబడుతుంది. వేడిగా ఉండే చేపలను తింటారు. ఇలా చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా వంటి రోగులు నయం అవుతాయని నమ్మకం. జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలు కూడా తగ్గుతాయని అంటారు. అందుకే మృగశిర కార్తె రాగానే ప్రజలందరూ చేపలు తినేందుకు మరింత ఆసక్తి చూపుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైవేటీకరణ దిశగా భారతీయ స్టేట్ బ్యాంకు? - సెంట్రల్ బ్యాంక్ - ఐవోబీ కూడా...