Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీలోఫర్ ఆసుపత్రిలో వంద పడకల ఐసీయీ వార్డు...

నీలోఫర్ ఆసుపత్రిలో వంద పడకల ఐసీయీ వార్డు...
, శనివారం, 13 నవంబరు 2021 (19:33 IST)
Nilofar
నీలోఫర్ ఆసుపత్రిలో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఐసీయీ వార్డును ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. హైసీయా , నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నదన్నారు. 
 
సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి గారు వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో 10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. 
 
కరోనా మూడో వేవ్ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5000 పడకలు ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం సీఎం రు. 133 కోట్లు విడుదల చేసిందన్నారు. ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలనే వుద్దేశంతో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలనే దిశగా ఇలాంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోరో వైరస్ అంటే.. లక్షణాలివే..