Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నయీమా? వాడెవడు.. టీవీల్లోనే చూశా : తెరాస ఎమ్మెల్యే కనకారెడ్డి

గ్యాంగ్‌స్టర్ నయీంతో పలువురు తెరాస నేతలకు సంబంధాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. దీంతో తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక్కోరోజు ఒక్కోనేత పేరు వస్తోంది.

నయీమా? వాడెవడు.. టీవీల్లోనే చూశా : తెరాస ఎమ్మెల్యే కనకారెడ్డి
, బుధవారం, 24 ఆగస్టు 2016 (14:33 IST)
గ్యాంగ్‌స్టర్ నయీంతో పలువురు తెరాస నేతలకు సంబంధాలు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. దీంతో తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒక్కోరోజు ఒక్కోనేత పేరు వస్తోంది. దీంతో వారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా తెరాసకు చెందిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ, నయీంతో కలిసి పలువురిని బెదిరించి డబ్బు వసూళ్ళకు పాల్పడినట్టు సినీ నిర్మాత నట్టి కుమార్ సంచలన ప్రకటన చేశారు. దీంతో కనకారెడ్డి బుధవారం మీడియా ముందుకు వచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకొచ్చారు. నయీం అనుచరులు తన గెస్ట్‌హౌస్‌లో ఆయుధాలతో తిరిగారన్న ఆరోపణల్లోనూ ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన నట్టి కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవసరమనిపిస్తే నట్టి కుమార్‌పై పరువు నష్టం దావా వేస్తానని కూడా ఎమ్మెల్యే కనకారెడ్డి హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోహిత్ వేముల దళితుడే కాదు.. ఆ నివేదిక గోప్యంగా ఉంచారు.. ఎందుకు?