Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ కోసం ఆ ప్రేమికులు చేతులు కట్టేసుకుని బావిలో దూకారు..

ప్రేమ కోసం ఆ ప్రేమికులు చేతులు కట్టేసుకుని బావిలో దూకారు..
, శుక్రవారం, 18 డిశెంబరు 2020 (16:03 IST)
ప్రేమ కోసం ఆ ప్రేమికులు కలిసే ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ అర్భన్ పోలీసుస్టేషన్ పరిధి‌లోని నక్కలపేల్లి గ్రామంలో ఓ ప్రేమ జంట వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే ఖిలా వరంగల్ మండలం నక్కలపల్లి గ్రామంలో వ్యవసాయ బావిలో ప్రేమ విఫలమైందని అదే గ్రామానికి చెందిన మన్నే సాయి, మెదక్ జిల్లాకు చెందిన తాటిపాముల అశ్విని చేతులు కట్టేసుకుని మరీ దూకి మరణించారు. వారిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమించుకున్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో ఢిల్లీలో చదువుతున్న సాయి ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చి ఇక్కడే వుంటున్నాడు.
 
మధ్యాహ్నం ఇంట్లో నుండి బయలుదేరిన సాయి వ్యవసాయ భావిలో పడినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన డిఆర్ఎఫ్ టీమ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటలు శ్రమించి ఎట్టకేలకు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఆత్మహత్య గురించి పోలీసులను వివరణ కోరగా సాయి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబోయే భార్యకు వెన్నెముక గాయం.. వరుడు ఏం చేశాడంటే?