Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరీంనగర్- జగిత్యాలలో లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి 82,000 ఎకరాల భూమిని మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Advertiesment
telangana govt
, శుక్రవారం, 11 ఆగస్టు 2023 (22:49 IST)
తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నూనెల సంస్థ లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు, కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లాల్లో 82,000 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ- సహకార శాఖ మంజూరు చేసింది. లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మహావీర్ లోహియా మాట్లాడుతూ, “ముడి పామాయిల్ దిగుమతిపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించి, దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల అవసరాలను తీర్చే ఈ కార్యక్రమం పట్ల మేము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. పరిశ్రమలో మా నైపుణ్యం, ప్రపంచ స్థాయి ప్రమాణాలు గత కొన్ని దశాబ్దాలుగా గుర్తించబడ్డాయి. ప్రభుత్వం యొక్క ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎంపిక కావటాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాము" అని అన్నారు. 
 
లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్:
లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక సాధారణ నూనె వెలికితీత యూనిట్ నుండి గగన్‌పహాడ్‌లోని ఒక పెద్ద అత్యాధునిక శుద్ధి కర్మాగారానికి, ఆ తర్వాత కాకినాడ మరియు మంఖాల్‌ ప్లాంట్లతో ఎదిగింది. వైవిధ్యభరితమైన ఈ వ్యాపార సంస్థ, ఇప్పుడు అనేక బ్రాండ్‌లను కలిగి ఉంది మరియు దేశవ్యాప్తంగా తమ కార్య కలాపాలను పెంచుతోంది. నాణ్యత హామీతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు VIMTA వంటి థర్డ్ పార్టీ ల్యాబ్‌లు నాణ్యతా ప్రమాణాల పరంగా పరీక్షలు చేస్తూ నాణ్యతకు నిరంతరం భరోసా ఇస్తున్నాయి.  
 
ఉత్తమ నాణ్యత కోసం ఐదుసార్లు CITD జాతీయ అవార్డు గెలుచుకుంది 
ఫోర్బ్స్‌లో ‘గమనించదగిన 5 అన్ లిస్టెడ్ ఎంటర్‌ప్రైజెస్’గా జాబితీకరించబడినది 
భారత సైన్యం కోసం ఆమోదించబడిన విక్రేత
FSSAI, హలాల్ మరియు HACCP ధృవీకరించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక మైనర్‌పై అత్యాచారానికి పాల్పడితే మరణదండనే.. నేర చట్టాల్లో సమూల మార్పులు