Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సొంత గూటికి చేరుకోనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

komatireddy rajagopal reddy
, సోమవారం, 23 అక్టోబరు 2023 (19:24 IST)
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత గూటికి చేరుకోనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ నుండి ప్రారంభించారు. మధ్యలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు.
 
ఇప్పుడు ఆయన తన సొంతింటికి చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి 2009 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ, 2014లో ఓటమి పాలయ్యారు. 2018 శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
 
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వున్నారు. బీజేపీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరేబియా, బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం-'హమూన్' తేజ్ వచ్చేస్తున్నాయ్!