Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యంలో విషం కలిపి భర్తకు ఇచ్చిన భార్య... ప్రియుడితో కలిసి ప్లాన్

మద్యంలో విషం కలిపి భర్తకు ఇచ్చిన భార్య... ప్రియుడితో కలిసి ప్లాన్
, సోమవారం, 29 ఏప్రియల్ 2019 (15:44 IST)
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో ఓ కూలీ హత్యకు గురయ్యాడు. కట్టుకున్న భార్యే తన ప్రియుడుతో కలిసి మద్యంలో విషం కలిపిచ్చి చంపేసింది. మృతుడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చైతన్యపురికి చెందిన 33 యేళ్ల వ్యక్తి ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చేరవేశారు. అయితే, మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో తమదైనశైలిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 
 
మృతి చెందిన వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మంచి స్నేహితుడు. ఈయన ఇంటికి వస్తూపోతూ హతుడి భార్యతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికిదారితీసింది. ఈ విషయం హతుడుకి తెలియడంతో ఆయన వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో తన భర్తకు మద్యం సేవించే అలవాటు ఉండటంతో తన ప్రియుడుతో కలిసి ఆ మహిళ హత్యకు ప్లాన్ చేసింది. శనివారం రాత్రి మద్యంలో విషం కలిపి ఇచ్చింది. ఇది సేవించిన ఆ వ్యక్తి అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ముక్కు, నోటిపై దిండుతో అదిమిపట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపేశారు. 
 
మరసటి రోజు విద్యుత్ షాక్‌తో చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. దీంతో హుతుడు భార్యతో పాటు ఆమె ప్రియుడుని పోలీసులు అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్యూటీకి వెళ్ళొద్దు నాన్న.. నాతో ఆడుకో.. పోలీస్ ఐతే ఇంతే? (వీడియో వైరల్)