Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాగుడుకు అలవాటుపడి.. అన్నయ్య తండ్రిని చంపేస్తే.. చెల్లాయి.. కన్నతల్లిని కర్రతో కొట్టి చంపేసింది..

సాధారణంగా పురుషులే మద్యానికి అలవాటుపడుతారు. పురుషుల తాగడానికి డబ్బులివ్వమని.. తల్లి వద్ద భార్య వద్ద గొడవపడుతుంటారు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మద్యానికి బానిస అయిన ఓ మహిళ కన్నతల్లినే హతమార్చి

తాగుడుకు అలవాటుపడి.. అన్నయ్య తండ్రిని చంపేస్తే.. చెల్లాయి.. కన్నతల్లిని కర్రతో కొట్టి చంపేసింది..
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (17:08 IST)
సాధారణంగా పురుషులే మద్యానికి అలవాటుపడుతారు. పురుషుల తాగడానికి డబ్బులివ్వమని.. తల్లి వద్ద భార్య వద్ద గొడవపడుతుంటారు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. మద్యానికి బానిస అయిన ఓ మహిళ కన్నతల్లినే హతమార్చింది. అంతేగాకుండా తల్లి శవంతోనే వారం రోజులు గడిపింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్ పేట్ మండలం ఇప్పతూరు గ్రామానికి చెందిన నర్సమ్మ (70)కు పార్వతమ్మ అనే కుమార్తె ఉండేది. ఈమె మద్యానికి అలవాటుపడి.. తాగేందుకు డబ్బులివ్వలేదని కన్నతల్లినే హతమార్చింది. వారంరోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. హతమార్చిన ఐదో రోజున తల్లి శవాన్ని తరలిస్తుండగా... స్థానికులు గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  
 
ఇకపోతే.. కాగా, నాలుగేళ్ల క్రితం ఇదే ఇంట్లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. మద్యానికి బానిసైన నర్సమ్మ పెద్ద కొడుకు సైతం తాగడానికి డబ్బులివ్వలేదన్న కారణంతో తండ్రిని హత్య చేశాడు. కాగా, మద్యానికి బానిసవడం వల్ల పార్వతమ్మ వైవాహిక జీవితం కూడా దెబ్బతిన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే రెండు పెళ్ళిళ్లు అయినా.. తాగుడుతో పుట్టింటికే పరిమితం అయ్యింది. 
 
వారం రోజుల క్రితం నర్సమ్మ తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో కర్రతో ఆమె తలపై కొట్టింది. ఈ దాడిలో నర్సమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు చెప్తున్నారు. ఈ నేరాన్ని నర్సమ్మ కూడా ఒప్పేసుకుందని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పళని స్వామి నన్ను చూసి నవ్వకు.. నవ్వితే నీ పనైపోద్ది.. స్టాలిన్ సలహా.. జయలలితను కూడా ప్రశ్నిస్తారా?