Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం... చిన్నారి ప్రాణాలు తీసింది...

Advertiesment
Hyderabad
, మంగళవారం, 11 జులై 2023 (10:06 IST)
హైదరాబాద్ నగరంలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. స్కూలు బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో ఇంటిముందు ఆడుకుంటున్న ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ కుర్మల్‌గూడ రాజీవ్ గృహకల్పకు చెందిన మిర్యాల వేణుగోపాల్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. రెండో కుమార్తె భావన (6) మల్లాపూర్‌లో యూకేజీ చదువుతుంది. సోమవారం పాటశాలకు వెళ్లొచ్చిన సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుంది. బాలాపూప్ర సిస్టర్ నివేదిక పాఠశాల బస్సు డ్రైవర్ లక్ష్మణ్ బస్సును నిర్లక్ష్యంగా నిడపి భావనను ఢీకొట్టాడు. 
 
బస్సు ముందు చక్రం చిన్నారి తలపై నుంచి వెళ్లడంతో ఘోరం జరిగిపోయింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. డ్రైవర్‌ను కూడా పట్టుకుని చితకబాదారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అరెస్టు చేశారు. 
 
నిశ్చితార్థం రద్దయిందనీ... యువతిని చంపేసిన యువకుడు 
 
హర్యానా రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. తనతో జరిగిన నిశ్చితార్థం రద్దు కావడంతో జీర్ణించుకోలేని ఓ యువకుడు.. ఆ యువతిని నిర్దాక్షిణ్యంగా చంచేశాడు. అందరూ చూస్తుండగానే ఆ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి (19)కి నాలుగు నెలల క్రితం రాజ్‌కుమార్ (23) అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈ నిశ్చితార్థం రద్దు అయింది. దీన్ని రాజ్‌కుమార్ జీర్ణించుకోలేక పోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ యువకుడు... యువతిని హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిశ్చితార్థం రద్దయిందనీ... యువతిని చంపేసిన యువకుడు .. ఎక్కడ?