Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీస్టేషన్ పక్కనే యువకుడు దారుణ హత్య.. పోలీసులేం చేశారంటే..

భాగ్యనగరం హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఒక యువకుడిని స్నేహితులే అతి దారుణంగా నరికి చంపేశారు. అది కూడా నడిరోడ్డుపై, పోలీస్టేషన్‌కు అతి సమీపంలోనే. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్

పోలీస్టేషన్ పక్కనే యువకుడు దారుణ హత్య.. పోలీసులేం చేశారంటే..
, సోమవారం, 12 మార్చి 2018 (16:36 IST)
భాగ్యనగరం హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఒక యువకుడిని స్నేహితులే అతి దారుణంగా నరికి చంపేశారు. అది కూడా నడిరోడ్డుపై, పోలీస్టేషన్‌కు అతి సమీపంలోనే. తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది.
 
హైదరాబాద్ మూసాపేటలోని జనతానగర్‌లో రాజు అనే వ్యక్తి పాలవ్యాపారం చేస్తుండేవాడు. రాజుకు మొత్తం నలుగురు కుమారులు ఉన్నారు. చివరి  వ్యక్తి సుధీర్ కూకట్‌పల్లి లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్నిరోజులుగా తన స్నేహితులతో సుధీర్‌కు గొడవలుండేవి. ఆ గొడవల కారణంగా నలుగురు స్నేహితులు కలిసి ఉదయం కళాశాలకు వెళుతున్న సుధీర్‌ను వెంబడించి అతి దారుణంగా రోడ్డుపై నరికి నరికి చంపారు. కూత వేటు దూరంలో పోలీస్టేషన్, ఎప్పుడూ ప్రజలు తిరుగుతుండేవారు. అలాంటి ప్రాంతంలోనే హత్య జరగడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
యువకుడు దారుణ హత్యకు గురైన తరువాత తాపీగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంఘటన జరిగిన తరువాత నలుగురు నిందితులు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చాకచక్యంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. ఆ నిందితుడి ద్వారా మిగిలిన వారిని ఈజీగా పోలీసులు కనిపెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా టీచర్‌తో సంబంధం.. వద్దన్నందుకు తల్లిని చంపేసిన యువతి.. ఎక్కడ?