Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లిని లొంగదీసుకున్నాడు... కూతురిపై అత్యాచారం... కామాంధుడి దారుణం...

ఒంటరిగా ఓ మహిళ వున్నదంటే కామాంధులు కాచుకుని కూర్చుని వుంటారు. ఏవో మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వారు సఫలమైతే ఇక ఆ తర్వాత వారి చేష్టలు మరింత వికృతరూపం దాల్చుతాయి

తల్లిని లొంగదీసుకున్నాడు... కూతురిపై అత్యాచారం... కామాంధుడి దారుణం...
, బుధవారం, 8 మార్చి 2017 (17:21 IST)
ఒంటరిగా ఓ మహిళ వున్నదంటే కామాంధులు కాచుకుని కూర్చుని వుంటారు. ఏవో మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో వారు సఫలమైతే ఇక ఆ తర్వాత వారి చేష్టలు మరింత వికృతరూపం దాల్చుతాయి. హైదరాబాదు లోని నేరేడ్‌మెట్‌లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. వివరాలు ఇలా వున్నాయి.
 
హైదరాబాద్ అడ్డగుట్టలో 35 ఏళ్ల వితంతువు కూలీ పని చేసుకుంటూ బతుకీడుస్తోంది. ఈమె సోదరి 11 సంవత్సరాల క్రితం మరణించడంతో ఆమెకు పుట్టిన పాపను ఈమే పెంచుతోంది. ఆమెకు 12 ఏళ్లు. ఆరవ తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఖలీల్ కళ్లు ఒంటరిగా వుంటున్న మహిళపై పడ్డాయి. ఆమెకు మాయ మాటలు చెప్పి, ఆసరాగా వుంటానని నమ్మించి ఆమెతో గత నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. 
 
ఐతే గత నెల రోజుల క్రితం బాలికపై కన్నేసిన ఖలీల్... ఆమెను భయపెట్టి అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని గత నెలరోజులుగా ఆ బాలికపై చేస్తూనే వున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక పినతల్లి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖాతాదారులకు గుడ్‌న్యూస్ : బ్యాంకుల బాదుడుకు చెల్లుచీటి... 'ఆధార్ పే' యాప్ విడుదల