Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ.. డ్రగ్స్ కేసులో పూర్తి రికార్డులు ఇవ్వాలి

Advertiesment
Ed
, శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (18:27 IST)
టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో చాలామంది సినీతారలు ఈడీ ఎంక్వయిరీలో పాల్గొని చివరికి తాము నిందితులము కామని నిరూపించుకున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో అధికారులు సినీ తారలకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా తెలంగాణలో మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారు అని.. డ్రగ్ పెడ్లర్ కెల్విన్‌తో లావాదేవీలు కూడా జరిపారు అన్న ఆరోపణలపై గత కొన్ని నెలల నుంచి విచారణ జరుపుతోంది.
 
పూర్తి వివరాలకోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖకు మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూర్తి రికార్డులు ఇవ్వాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు లేఖ రాయడంతో సాక్షులు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, నిందితుల వాంగ్మూలం ఇలా అన్ని వివరాలను తెలియజేయాలని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక త్వరలోనే ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ ను ఈడీ కోరడం జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ ప్రశ్నపత్రం లీక్