Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడు.. లోపల నరహంతకుడు: నారాయణ.. నారాయణ

హైదరాబాద్‌ను పోలీసుల మయం చేసి, తెలంగాణ నిరుద్యోగుల ర్యాలీని భగ్నం చేసి టీజేఎసీ చైర్మన్ కోదండరామ్‌ను తలుపులు బద్దలు గొట్టి మరీ లాగి పోలీసు స్టేషన్‌కీడ్చిన కేసీఆర్ అదే సమయంలో పరమ భక్తుడిలా తిరుమల సందర్సించి దేవుడికి మొక్కులు చెల్లించడంపై నారాయణ నిప్పుల

కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడు.. లోపల నరహంతకుడు: నారాయణ.. నారాయణ
హైదరాబాద్ , గురువారం, 23 ఫిబ్రవరి 2017 (06:40 IST)
సీపీఐ నేత నారాయణ దుడుకు నోటి కారణంగా అప్పుడప్పుడు విమర్శల పాలవుతుంటారు కానీ తాను చెప్పాల్సింది ముక్కుసూటిగా చెప్పడంలో తనను మించిన వారు లేరనే చెప్పాలి. హైదరాబాద్‌ను పోలీసుల మయం చేసి, తెలంగాణ నిరుద్యోగుల ర్యాలీని భగ్నం చేసి టీజేఎసీ చైర్మన్ కోదండరామ్‌ను తలుపులు బద్దలు గొట్టి మరీ లాగి పోలీసు స్టేషన్‌కీడ్చిన కేసీఆర్ అదే సమయంలో పరమ భక్తుడిలా తిరుమల సందర్సించి దేవుడికి మొక్కులు చెల్లించడంపై నారాయణ నిప్పులు చెరిగారు. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్‌ పైకి మాత్రమే భక్తుడిలా కనిపిస్తున్నారని, లోపల నరహంతకుడిగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఏపీ భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ పోలీస్‌ క్యాంపుగా మారిపోయిందనీ పాకిస్తాన్‌ సరిహద్దుగా మార్చేశారన్నారు. తమ ఉద్యోగాలు తమకు ఇవ్వండన్న విద్యార్థుల కోరిక న్యాయబద్ధమైనందునే జేఏసీ చైర్మన్‌ కోదండరామ్, కమ్యూనిస్టులు దానికి మద్దతు పలికారని తెలిపారు. కోదండరామ్‌ను, విద్యార్థి నేతలను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారన్నారు.
 
ఒకవైపు తిరుపతిలో దైవపూజ చేస్తూ మరొకవైపు ఇలా అమానవీయంగా కేసీఆర్‌ ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. ఇది ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఇలాంటి నిర్బంధం ఉంటే ఎలా ఉండేదని ప్రశ్నించారు. 
 
మరోవైపు నారాయణ ఏపీ సీఎం చంద్రబాబునూ వదల్లేదు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ మరోవైపు కేంద్రానికి బానిసలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగిందనీ, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందని సీఎం, మంత్రులు ప్రచారం చేశారనీ అలాంటిదేమీ లేదన్నారు. కేబినెట్‌ ఎజెండాలో ఆ అంశమే లేదనీ ఇలా ఎన్నిరోజులు మోసం చేస్తారని ప్రశ్నించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో అమెరికన్లకు. ఇండియాలో ఇండియన్లకే ప్రాధాన్యమివ్వాలి: మైక్రోసాప్ట్ సీఈఓ