Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వదిన, మరిది ఒకే చీరకు ఉరేసుకున్నారు.. కారణం అదే..?

వదిన, మరిది ఒకే చీరకు ఉరేసుకున్నారు.. కారణం అదే..?
, మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:59 IST)
వివాహేతర సంబంధాలు ఎందరో చావులకు కారణమవుతున్నాయి. తాజాగా వదిన, మరిది వివాహేతర సంబంధం చివరికి ఒకరి మరణానికి కారణమైంది. మరోకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తమ బంధం గురించి అందరికీ తెలుస్తోందని వదిన, మరిది ఒకే చీరకు ఉరేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. దేవరకద్ర మండలంలోని గోపనపల్లి గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఆంజనేయులుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య అర్చన(23) తన భర్త కుటుంబంలో వరుసకు మరిది అయ్యే మధు(22)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం ఇతరులకు తెలియడంతో మనస్తాపానికి గురైన ఆ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఇద్దరూ కలిసి ఇంట్లోనే ఒకే చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్యంలోనే అర్చన మృతి చెందింది. మరోవైపు మధు పరిస్థితి విషమంగా ఉంది. దాంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీతో అంట‌కాగుతూ... స్టీల్ ప్లాంట్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్య‌మం!