Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాఠశాలల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. స్కూల్‌లోనే ఐసోలేషన్‌

పాఠశాలల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. స్కూల్‌లోనే ఐసోలేషన్‌
, గురువారం, 18 మార్చి 2021 (13:27 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాఠశాలల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అనేక మంది విద్యార్థులు, టీచర్స్ కరోనా బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా తరగతుల నిర్వహణపై పునరాలో చేస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన వ్యక్తం చేశారు. 
 
తాజాగా హైదరాబాద్ నాగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో స్కూల్‌ను మూసివేశారు. తోటి ఉపాధ్యాయులకు వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. బుధవారం నాగోల్‌లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 38 విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు భయాందోళనకు గురతున్నారు. అప్రమత్తమైన అధికారులు కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 184 మంది విద్యార్ధినులకు పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.
 
మిగితావారికి అధికారులు ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. అయితే కరోనా సోకిన 38 విద్యార్ధులకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన విద్యార్ధులను ఇళ్లకు పంపేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. పాజిటివ్‌ వచ్చిన వారికి స్కూల్‌లోనే ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రికి షాకిచ్చిన కాంగ్రెస్