Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఇంటర్‌లో 982 మార్కులు సాధించిన గుంటూరు బాలిక మానస

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఆకురాతి మానస తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 982 మార్కులు సాధించింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీలో ఆకురాతి మానస ఇంటర్ బైపీసీ చదివింది. ఈ బాలిక హాల్ టిక్కెట్ నెంబర

తెలంగాణ ఇంటర్‌లో 982 మార్కులు సాధించిన గుంటూరు బాలిక మానస
, సోమవారం, 17 ఏప్రియల్ 2017 (21:20 IST)
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఆకురాతి మానస తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 982 మార్కులు సాధించింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీలో ఆకురాతి మానస ఇంటర్ బైపీసీ చదివింది. ఈ బాలిక హాల్ టిక్కెట్ నెంబర్ 1762219763. 
 
ఆకురాతి వరహా కిషోర్, బాలసరస్వతిల కుమార్తె అయిన మానస రాజమండ్రి, కోల్‌కతా, భువనేశ్వర్, విజయవాడ, హైదరాబాద్‌లలోని  కేంద్రీయవిద్యాలయాల్లో పదవ తరగతి వరకు చదివింది. అధిక మార్కులు సాధించిన సందర్భంగా మానస మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకంలో ఇది సాధ్యమైందని తెలిపింది. శ్రద్ధ, ఏకాగ్రాతతో చదివితే ఏదీ కష్టం కాదని తెలిపింది. వైద్య వృత్తికి సంబంధించిన కోర్సు చేసి, ఆరోగ్య భారత్‌లో భాగస్వామిని కావాలనుకుంటున్నట్లు మానస చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమిత్ షా తెలంగాణ టీ.కాంగ్రెస్ ఆకర్ష్... కాంగ్రెస్ ఖాళీ? తెలంగాణకు విస్తరణ నాయకులు