Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 2 March 2025
webdunia

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం వజ్రాలు స్వాధీనం

Advertiesment
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం వజ్రాలు స్వాధీనం
, ఆదివారం, 4 అక్టోబరు 2020 (12:52 IST)
హైదరాబాద్ శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 21 కిలోల బంగారంతో పాటు, 30 కోట్ల విలువైన వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ముంబైకి తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 
 
ముంబైకి తరలించేందుకు స్మగ్లర్ పన్నిన పన్నాగాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారుల బృందం ఎయిర్ పోర్టులో 5 గంటలుగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. భారీ ఎత్తున బంగారం డైమండ్ జ్యువలరీ ఆభరణాలు అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో ఎయిర్ కార్గోలో అధికారులను అలర్ట్ చేశారు. 
 
ఆ వెంటనే రంగంలోకి దిగిన కస్టమ్స్ అధికారులు.. డిప్యూటీ కమిషనర్ అధికారుల బృందం పెద్ద ఎత్తున బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రా భరణాలు బంగారానికి పైనుండి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి తరలిస్తున్నారు స్మగ్లర్లు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భవిష్యత్‌కు నిజమైన పరీక్ష ఇది.. విజయం సాధిస్తా : డోనాల్డ్ ట్రంప్