Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ మహమ్మారి.. డిప్యూటీ సీఎంకు స్వైన్ ఫ్లూ

స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగుచూడగా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇందులో 13మందికి హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధుల

Advertiesment
18 Fresh Swine Flu Cases Reported In Telangana
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (11:42 IST)
స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగుచూడగా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇందులో 13మందికి హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యుల పరీక్షల్లో తేలింది. 85 మంది రోగులను పరీక్షించగా వారిలో 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలినట్లు వైద్యులు తెలిపారు. 
 
గత ఏడాది 3,696 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా వారిలో 250 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని వెల్లడైంది. ఈ వ్యాధిని నయం చేసేందుకు అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల లక్షణాలుంటే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని వైద్యులు కోరారు.
 
ఇదిలా ఉంటే.. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీకే స్వైన్ ప్లూ సోకింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఇది అంటు వ్యాధి కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌లో ఈ నెలలో స్వైన్ ప్లూతో ఐదుగురు మరణించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.వంద కోట్ల భూస్కామ్‌కు పాల్పడిన తాహశీల్దారు... ఎక్కడ?