తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ఉద్యోగాల జాతర ఆరంభంకానుంది. భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీఎస్ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఆయన తెలిపారు. వీటి భర్తీ తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గుతుందన్నారు.
కొత్తగా భర్తీ చేసే పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సంస్థలోని ఉద్యోగులు సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఖుష్రోషా ఖాన్, వెంకన్న, మునిశేఖర్, రాజశేఖర్, జాయింట్ డైరెక్టర్లు ఉషాదేవి, నర్మద, రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీలత, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.