హైదరాబాద్ రామంతపూర్లోని మూసీ నది సమీపంలోని బహిరంగ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలివేసారు. బట్టలతో చుట్టబడి ఏడుస్తున్న శిశువును గమనించిన స్థానికులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.
ఉప్పల్ పోలీసుల సహాయంతో, అంబులెన్స్ సిబ్బంది మెరుగైన సంరక్షణ కోసం శిశువును నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. శిశువు పరిస్థితి నిలకడగా ఉందని సిబ్బంది తెలిపారు.
మూసి నది సమీపంలో శిశువును వదిలివేసిన వ్యక్తుల వివరాలను తెలుసుకోవడానికి ఉప్పల్ పోలీసులు స్థానికులతో విచారిస్తున్నారు. ఇంకా సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.