Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Monsoon: నైరుతి రుతుపవనాలు - అంతకుముందే అల్పపీడనం.. తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

Advertiesment
Monsoon

సెల్వి

, బుధవారం, 21 మే 2025 (09:31 IST)
నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి. జూన్ మొదటి వారం నాటికి రాష్ట్రాన్ని తాకవచ్చు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావం అంతకంటే ముందుగా రుతుపవనాలను రాష్ట్రాలను తాకేలా చేస్తున్నాయి. 
 
మే 22 నాటికి కర్ణాటక తీరంలో అల్పపీడన ప్రాంతంగా పరిణామం చెంది మరింత తీవ్రమవుతుందని ఐఎండీ  అధికారులు తెలిపారు. రుతుపవనాలు అధికారికంగా రాష్ట్రంలోకి ప్రవేశించే ముందే తెలంగాణలో దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. మిగతా చోట్ల, తెలంగాణలో రాబోయే రెండు, మూడు రోజుల్లో, ముఖ్యంగా ఉత్తర, మధ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. 
 
ఇందులో భాగంగా తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది. "నైరుతి రుతుపవనాలు రాబోయే 4-5 రోజుల్లో కేరళకు చేరుకోవడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇది 2010 తర్వాత ఇది తొలి ప్రారంభం కావచ్చు" అని ఐఎండీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. 
 
కేరళలో రుతుపవనాల సాధారణ ప్రారంభ తేదీ జూన్ 1. అయితే మే 27కి ముందు రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 
 
తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ విధించారు. 
 
ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. బంగాళాఖాతం, మయన్మార్ తీరప్రాంతంలో కదలికను బట్టి, కేరళకు ముందే ఈశాన్యంలో రుతుపవనాలు వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మరికొత్త జిల్లాలు.. పాత జిల్లాల పునర్విభజన చేస్తారా