Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విషయం చెప్పండి .. ఓవర్ యాక్షన్ చెయొద్దు : హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Video)

Advertiesment
ranganathan

ఠాగూర్

, సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (13:13 IST)
హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందు ఆ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో ఓ స్వతంత్ర బాడీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు కమిషనర్‌గా రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. 
 
ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. ముఖ్యంగా, ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల అభిప్రాయాలను రంగనాథ్ తెలుసుకుంటున్నారు. ఆ సమయంలో ఐలాపూర్ గ్రామ వాసి, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం... హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. 
 
ఆ సమయంలో తెలుగు వచ్చా అంటూ రంగనాథ్‌ను ముఖీం ప్రశ్నించారు. మీరు చెప్పేది మీరు చెప్పండి.. ఓవర్ యాక్షన్ చెయొద్దంటూ అంటూ ముఖీంను హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళతో సహజీవనం.. కుమార్తెలపై అత్యాచారం.. హెచ్‌ఐవీ సోకడంతో...