Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hyderabad: కూరగాయల కత్తితో భర్తను నరికేసిన భార్య.. కారణం ఏంటో తెలుసా?

Advertiesment
Crime

సెల్వి

, శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (10:54 IST)
హైదరాబాద్‌ కోకాపేట్‌లో దారుణం వెలుగు చూసింది. భర్తను ఓ భార్య హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన భార్యాభర్తలు కోకాపేటలో నివాసం ఉంటున్నారు. అయితే  గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆవేశంతో భార్య కత్తితో భర్తపై దాడి చేసింది. దీంతో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. అతని కేకలు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడ్డ బాధితుడు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన భార్యభర్తలు కృష్ణ జ్యోతి బోరా, భరత్ బోరా బతకుతెరువు కోసం అస్సాం నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. కొకాపేట్‌లో ఉంటూ స్థానికంగా కార్మికులుగా పని చేస్తూ జీవనం‌ సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్య కృష్ణ జ్యోతిని భర్త కృష్ణ వేధింపులకు గురిచేస్తున్నాడు. 
 
ఇదే క్రమంలో గత అర్ధరాత్రి కూడా చిన్న విషయానికి భార్యాభర్తలు తీవ్రంగా గొడవ పడ్డారు. చివరకు భర్త వేధింపులు తట్టుకోలేక విచక్షణ కోల్పోయిన భార్య.. అతడిపై కూరగాయల కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోయాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం