Publish Date: Wed, 17 Jul 2024 (09:11 IST)
Updated Date: Wed, 17 Jul 2024 (08:54 IST)
తెలుగు రాష్ట్రాల్లో నానాటికీ వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ఈ శునకాలు దాడిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దాడులు రోజూ రోజుకు పెరుగుతున్నాయి. అయితే, అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా వీధి కుక్కల దాడిలో ఒక బాలుడు మృతి.. మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్, జవహర్ నగర్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి, విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు. జగిత్యాల - బీర్పూర్ మండలం మంగెలలో ఇంటి బయట ఆడుకుంటున్న దేవేందర్(7) అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలు అయ్యాయి.. అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.