Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏటీఎం మెషీన్లలోని రూ.42లక్షలు స్వాహా.. హర్యానా ముఠా కోసం వేట

Money

సెల్వి

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (10:14 IST)
హర్యానాకు చెందిన దొంగల ముఠా ఏటీఎం మెషీన్లలోని భారీ మొత్తాన్ని కొట్టేసింది. కడప ఒంటిమిట్టలోని రెండు ఏటీఎంల నుంచి రూ.42 లక్షలు, కడప ప్రధాన కార్యాలయంలోని మరో ఏటీఎంపై కూడా ఆదివారం తెల్లవారుజామున దాడి చేసేందుకు ప్రయత్నించారు. 
 
దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్‌హెచ్ రోడ్ల వెంబడి ఉన్న ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడంలో పేరుగాంచిన ఈ ముఠా చెక్‌పోస్టులను తప్పించుకోవడానికి కట్టర్‌లను ఉపయోగించి లారీలలో తప్పించుకునే స్కెచ్ వేస్తోంది.
 
ఈ క్రమంలో ఆదివారం ఒక్కరోజే మూడు ఏటీఎం కేంద్రాలపై దాడులు చేశారు. ఒంటిమిట్ట ఏటీఎంలో తొలిసారిగా చోరీకి పాల్పడి కట్టర్లను ఉపయోగించి రూ. 36 లక్షలు తీసుకుని కడపలోని ద్వారకా నగర్ ఏటీఎంకు వెళ్లారు.. అక్కడ రూ.6 లక్షలు కొల్లగొట్టారు. 
 
ఆపై కడపలోని విశ్వేశ్వరయ్య సర్కిల్‌లోని ఏటీఎంలోనూ దోపిడీకి యత్నించారు. ఈ ఘటనలపై స్పందించిన కడప పోలీసులు జిల్లాలో వరుస చోరీలపై నిఘా పెంచారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 
 
ఈ దొంగల ముఠాను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత నెలలో ఇదే తరహాలో ఏటీఎం చోరీలకు పాల్పడిన ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్చిపై దాడి జరిగివుంటే గ్లోబల్ న్యూస్ అయ్యేది... హిందువులు మనుషులు కారా : పవన్ కళ్యాణ్ ప్రశ్న