Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం మత్తుతో వేగంగా కారును నడిపాడు.. ఏడేళ్ల బాలుడి మృతి

road accident

వరుణ్

, ఆదివారం, 4 ఆగస్టు 2024 (16:03 IST)
మద్యం మత్తు ఓ చిన్నారి ప్రాణం తీసింది. గోల్కొండ పోలీసు పరిధిలోని ఇబ్రహీంబాగ్ వద్ద మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తన వేగంగా వెళ్తున్న కారును మోటర్‌బైక్‌పై ఢీకొట్టడంతో ఏడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, అతని తండ్రికి గాయాలయ్యాయి. 
 
మృతుడు వైఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన సౌర్యగా గుర్తించారు. అతని తండ్రి రమేష్‌కు గాయాలు కాగా, ప్రాణాపాయం లేదు. ఈ ప్రమాదంలో సౌర్య తలకు తీవ్రగాయమైంది. 
 
కారు డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, స్థానికులు కారును వెంబడించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి బండి నడపడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రమ్ముల్లో 800 కిలోలకు పైగా గంజాయి.. శంషాబాద్‌లో స్వాధీనం