Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమీన్‌పూర్ హత్య కేసు: ఇద్దరూ కలవకుంటే నా కూతురికి కడుపు ఎలా వచ్చింది?

Advertiesment
Crime

ఐవీఆర్

, గురువారం, 11 డిశెంబరు 2025 (19:28 IST)
అమీన్ పూర్ లో బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి హత్యకు సంబంధించి మీకు ఇష్టం వచ్చినట్లు రాయవద్దని శ్రవణ్ సాయి ప్రేయసి తల్లి హెచ్చరించింది. ఆమె మాట్లాడుతూ... తప్పు నా కుమార్తెలోనే వుంది. ఆమె ఫోన్ మెసేజ్ చేస్తేనే అతడు ఇక్కడికి వచ్చాడు. అతడ్ని నేను ఒక్కసారి మాత్రమే చూచాను. మళ్లీ రెండోసారి మొన్న చూసాను. మీ మీడియావాళ్లు నోటికొచ్చింది ఏదిబడితే అది చెప్పకండి.
 
చేతికి ఏది రాయాలనిపిస్తే అది రాయకండి. నా కుమార్తెతో అతడు కలవకపోతే నా పాపకు కడుపు ఎలా వచ్చింది? గండిమైసమ్మ పార్కు దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు. తెల్లవారు జాము నాలుగున్నర అవుతున్నా అమ్మాయి జాడ లేకపోతే ఆందోళన చెందాను. అప్పుడే అతడ్ని చూసాను. ఈ సమస్యలన్నిటికీ కారణం నా కూతురే. అందుకే ఆమెను కొట్టాను. ఆమెను కొడుతుంటే అతడు అడ్డు వచ్చాడు. అందుకే అతడికి కూడా దెబ్బలు తగిలాయి.
 
ఆ కుర్రాడేదో ఉన్నత కులానికి చెందినవాడంటున్నారు. అతడు ఏ కులం వాడైతే నాకేంటి, నా కూతురు పట్ల ప్రవర్తించిన తీరుపై కొన్నిరోజుల క్రితం అబ్బాయి ఫ్యామిలీ వాళ్ల వద్దకు వెళ్లి చెప్పి వచ్చాం. ఈ వ్యవహారంలో మొత్తం ఏం జరిగిందో పోలీసులకు వచ్చి చెబుతాను. అప్పుడు మీరు గుద్దుకోండి అంటూ చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి కొండా సురేఖ అరెస్టు తప్పదా?