Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raja Singh: గో హత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలి: రాజా సింగ్ (video)

Advertiesment
Raja Singh

సెల్వి

, శనివారం, 7 జూన్ 2025 (12:13 IST)
Raja Singh
బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి తాకుతుంది అని తెలంగాణ బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. "గో" మాతను జాతీయ పశువుగా ప్రకటించాలని.. గో హత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని రాజా సింగ్ అన్నారు. 
 
కాగా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే రాజా సింగ్.. ఇటీవల బీజేపీలో ఇంటి దొంగల బాగోతం బయటపెడతానని హెచ్చరించారు. కొందరు నేతలు బీఆర్ఎస్ నాయకులకు బీజేపీని తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాజాసింగ్ ఆరోపించారు. 
 
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇంటి దొంగలంతా ఒక్కటయ్యారని.. తనకు నోటీసులు ఇవ్వడం కాదు.. దమ్ముంటే సస్పెండ్ చేయాలని రాజా సింగ్ సవాల్ చేయడం సంచలనంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Peacok: తల్లి ప్రేమ- కొండచిలువతో నెమలి ఫైట్.. ఎందుకో తెలుసా? (video)