Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాదీలు.. ప్లీజ్ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయండి...

charminar
, గురువారం, 30 నవంబరు 2023 (14:23 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు దాదాపుగా 39 శాతం మేరకు పోలింగ్ పోలైంది. అయితే, చాలా ప్రాంతాల్లో చాలా తక్కువగా పోలింగ్ నమోదైంద. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీంతో మధ్యాహ్నం 11 గంటల వరకు కేవలం 20 శాతం మేరకు మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ, హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా తక్కువగా నమోదైంది. 
 
హైదరాబాద్ నగరంలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి మూడు గంటల్లో అంటే పది గంటల వరకు హైదరాబాద్‌‍లో నమోదైన పోలింగ్ కేవలం 5 శాతం. రాజధాని నగరంతో పోల్చుకుంటే గ్రామీణ తెలంగాణలో పోలింగ్ ఎక్కువగానే ఉంది. ఉదయం పది గంటల వరకు నాంపల్లిలో అత్యల్పంగా 0.5 శాతం, సనత్ నగర్ 1.2 శాతం, కూకట్పల్లిలో 1.9 శాతం, మేడ్చల్లో 2 శాతం, గోషామహల్లో 2 శాతం, చార్మినార్ లో 3 శాతం, ముషీరాబాద్లో 4 శాతం, రాజేంద్రనగర్లో 15 శాం పోలింగ్ నమోదైంది.
 
హైదరాబాదీలు... దయచేసి బయటకు వచ్చి ఓటు వేయండి.. మీకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించింది... ఓటు వేయడం కోసమేనని గుర్తుంచుకోండి అని ఎన్నికల అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు, సినీ సెలెబ్రిటీలు చిరంజీవి, సాయిధరమ్ తేజ్, సుమ కనకాల, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఓటు వేసి, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా తెలంగాణలో జరుగుతున్న పోలింగ్ శాతంతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో చాలా తక్కువగా ఉంటోంది.
 
ప్రతి ఎన్నికల్లోనూ హైదరాబాద్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడు కూడా 54 శాతం ఓటింగ్ మించలేదు. దీంతో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతిచోట ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచారాలు నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చింతమడకలో ఓటేసిన సీఎం కేసీఆర్ - మధ్యాహ్నం ఒంటి గంటకు 36.68 శాతం పోలింగ్