Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పోతారు సార్' అని కానిస్టేబులే చెప్పారు : గజ్వేల్ ఫలితంపై లగడపాటి సంచలన కామెంట్స్

Advertiesment
Lagadapati Rajagopal
, బుధవారం, 5 డిశెంబరు 2018 (13:07 IST)
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ అసెంబ్లీ స్థానం ఎన్నికల ఫలితంపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల సర్వేలో భాగంగా, గత అక్టోబరు నెల 28వ తేదీన తాను గజ్వేల్‌కు వెళ్లినట్టు లగడపాటి ప్రకటించారు. 
 
ఆ సమంయలో పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపి తనిఖీ చేశారని చెప్పారు. అపుడు తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో సెల్ఫీలు వారు దిగారన్నారు. గజ్వేల్‌లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగితే.. దానికి వారు.. 'పోతారు సార్..' అని ఏడుగురు కానిస్టేబుళ్లు సమాధానమిచ్చారని చెప్పారు. 
 
గజ్వేల్‌లో ఎవరు పోతారో..? ఎవరు గెలుస్తారో...? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు. నిజం చేదు మాత్రలా ఉంటుందని, అందువల్లే కేసీఆర్ తనపై ఆరోపణలు చేస్తున్నారనీ, ఈనెల 11వ తేదీ సాయంత్రం అన్ని విషయాలను వెల్లడిస్తానని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ప్రేమికుడు.. ఇలా చేశాడు..