Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఎన్నికల పోలింగ్ : ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ : ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్
, శుక్రవారం, 7 డిశెంబరు 2018 (12:49 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే కొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, తెరాస వర్సెస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. 
 
అయితే, ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 23 శాతం పోలింగ్ నమోదైనట్టు సమచారాం. మరోవైపు గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. అదేసమయంలో యువత కూడా తమ ఓటుహక్కును పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులుతీరుతున్నారు. 
 
ముఖ్యంగా, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో పది శాతం, వరంగల్ జిల్లాలో 22 శాతం, జగిత్యాలలో 18 శాతం, కరీంనగర్ జిల్లాలో 15 శాతం, మెదక్ జిల్లాలో 14 శాతం, పాలమూరు జిల్లాలో 12 శాతం, కామారెడ్డిలో 27 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. 
 
మరోవైపు, పోలింగ్ సాయంత్రం 5 గంటలకు సాగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం 4 గంటల వరకు జరుగుతుంది. నిర్దేశించిన సమయం దాటిన తర్వాత పోలింగ్ బూత్‌కు చేరుకునే ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించరని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిపై రాళ్ళదాడి.. వరంగల్‌లో రూ.7 కోట్లు స్వాధీనం