Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాపై లంక విజయం

వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాపై లంక విజయం
శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే రాణించడంతో నాటింగ్‌హామ్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలి వికెట్‌కు తిలకరత్నే (17), సనత్ జయసూర్య (29) 34 పరుగులు జోడించగా, అనంతరం వచ్చిన జయవర్దనే (43) చెలరేగి ఆడాడు.

దీంతో 152 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. షకీబల్ హసన్ (23), రఖీబుల్ హసన్ (38 నాటౌట్), ముష్ఫిఖార్ రహీమ్ (34) రాణించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.

Share this Story:

Follow Webdunia telugu