Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"రాగి వీల్స్‌"లో మిథియోనైన్ అమీనో పుష్కళం

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
మైదా.. 300 గ్రా.
వెన్న.. తగినంత
తాజా రాగిపిండి.. 200 గ్రా.
పంచదార పొడి.. 350 గ్రా.
ఎండుకొబ్బరిపొడి.. ఒక కప్పు
చిక్కటి పాలు.. ఒక కప్పు
యాలకులపొడి.. ఒక టీ.
నల్ల మిరియాలపొడి.. అర టీ.
ఉప్పు.. పావు టీ.

తయారీ విధానం :
వెన్న, పంచదార పొడి, యాలకులపొడి, మిరియాల పొడి, ఉప్పు, పాలు పోసి మృదువుగా కలిపి మిశ్రమం తయారుచేయాలి. జల్లించిన మైదా, రాగిపిండి, కొబ్బరిపొడుల్ని కూడా ఈ మిశ్రమంలో కలపాలి. తరువాత అరగంటసేపు దానిని గాలి చొరబడకుండా ఉండేలా ఒక పాత్రలో భద్రపరచాలి. నున్నటి పీట లేదా రాయి మీద ఈ మిశ్రమాన్ని వేసి.. రెండు మడతల్లో అరంగుళం మందంగా ఉండేలా పెద్ద రొట్టెను చేసి కావలసిన సైజుల్లో చాకుతోగానీ అంచులున్న పాత్రతో గానీ కత్తిరించాలి.

నెయ్యి లేదా నూనె రాసిన లోతున్న ప్లేటులో వీటిని ఉంచి, ఇసుక పోసిన కుక్కర్‌లోగానీ మందపాటి పాత్రలో గానీ సుమారు పది నిమిషాల సేపు ఉడికించాలి. అదే మైక్రోవేవ్ ఒవెన్‌లో అయితే 20 నిమిషాలు పాటు 360 డిగ్రీల ఫారెన్‌హీట్‌ దగ్గర బేక్‌ చేసి తీసేయాలి. అంతే రాకి వీల్స్ రెడీ..! పేద ప్రజల ఆహారంలో లోపించిన మిథియోనైన్ అమీనో ఆమ్లం రాగిలో పుష్కళంగా లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu