కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీ.
మంచినీళ్లు... తగినన్ని
పంచదార... ఒక కేజీ
పనీర్... 700 గ్రా.
గోధుమ రవ్వ... 150 గ్రా.
నెయ్యి (పిండిలోకి)... పది గ్రా.
డాల్డా లేదా నెయ్యి... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
తక్కువ మంటమీద పాలను మరిగించాలి. మధ్యమధ్యలో తిప్పుతూ ఉండాలి. పాలలో నాలుగోవంతు మాత్రమే మిగిలేలా అంటే కోవాలా అయ్యేవరకూ మరిగించి, చల్లార్చి మెత్తగా మెదపాలి. పంచదారలో నీళ్లు కలిపి తక్కువ మంటమీద గులాబ్జామ్ పాకంలా లేతపాకం పట్టాలి.
ఇప్పుడు... పనీర్, రవ్వ, ఉడికించిన కోవా, నెయ్యిలను ఒక పాత్రలో వేసి కాస్త జారుగా జిలేబీ మిశ్రమంలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాస్త లావు రంధ్రం ఉన్న ఓ ప్లాస్టిక్ లేదా పాలకవర్లో వేసి మరుగుతున్న నెయ్యిలో వేసి.. జిలేబీ చుట్టలు మాదిరిగా చుట్టి వేయించి, పాకంలో వేస్తే మిల్క చనార్ జిలేబీలు రెడీ అయినట్లే..!