Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాంద్ బిస్కట్స్

Advertiesment
వంటకాలు స్వీట్లు మైదా పంచదార పొడి యాలకులు వనస్పతి పావు కేజీ
, శనివారం, 26 జులై 2008 (17:57 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
మైదా... 500 గ్రాములు
పంచదార పొడి... పావు కిలో
యాలకులు... 3 గ్రాములు
వనస్పతి... పావు కిలో

తయారీ విధానం :
మైదాను జల్లించుకొని మధ్యలో గొయ్యిలా చేసి, వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యే వరకూ ఉంచాలి. తరువాత పంచదార పొడి చేర్చి, కొద్దికొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయండి. మైదా అంతా కలిసిన తరవాత బాగా కలిపి మర్దనా చేసి, పిండి ముద్దలా చేస్తే మెత్తగా తయారవుతుంది. ఈ పిండికి యాలకుల పొడి కూడా కలుపుకోవాలి.

తరువాత ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్న చపాతీలా చేయాలి. పదునుగా ఉన్న గ్లాసు అంచుతో ఆ చపాతీని కోస్తే అర్థచంద్రాకారంలోఉన్నట్లుగా బిస్కెట్లు తయారవుతాయి. అలా తయారయిన వాటిని ఒక ట్రేలో అమర్చి 180 డిగ్రీల సెల్సియస్ దగ్గర 20 నిమిషాలపాటు మైక్రోఓవెన్‌లో ఉడికించాలి. అంతే చాంద్ బిస్కట్స్ రెడీ! చల్లారిన తరవాత వీటీని తింటే చాలా రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu