Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెజ్లర్‌ ప్రాణాలు తీసిన వర్షపు నీరు.. ఎక్కడ?

వర్షపు నీరు తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. ఈ నీరు జాతీయ స్థాయి రెజ్లర్ ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది

రెజ్లర్‌ ప్రాణాలు తీసిన వర్షపు నీరు.. ఎక్కడ?
, గురువారం, 10 ఆగస్టు 2017 (13:42 IST)
వర్షపు నీరు తీవ్రవిషాదాన్ని మిగిల్చింది. ఈ నీరు జాతీయ స్థాయి రెజ్లర్ ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
రాంచీలో జైపాల్ సింగ్ స్టేడియాన్ని 1978 సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీలకు సిద్ధమయ్యే ఆ రాష్ట్ర క్రీడాకారులు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అదేసమయంలో ఈ స్టేడియంలో వర్షపు వెళ్లేందుకు సరైన వసతులు లేవు. 
 
అయితే, తాజాగా భారీవర్షం కురవడంతో స్టేడియంలో వర్షం నీరు నిలిచింది. అదేసమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ నీటిలో విద్యుత్ ప్రవహించింది. ఈ విషయం తెలియని 25 ఏళ్ల రెజ్లర్ విశాల్ కుమార్ వర్మ స్టేడియంలోకి రోజువారీగా ప్రాక్టీస్ చేసేందుకు రాగా, విద్యుదాఘాతానికి గురై అపస్మారకంగా పడిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్టేడియం సిబ్బంది విశాల్ కుమార్ వర్మను అక్కడి వారు సర్దార్ ఆసుపత్రికి తీకుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని రాష్ట్ర రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోలానాథ్ సింగ్ తెలిపారు.
 
విశాల్ కుటుంబానికి తక్షణ సాయంగా రూ.లక్ష, ఆయన నలుగురు చెల్లెళ్లకూ ఉద్యోగాలు లభించేంత వరకూ నెలకు రూ.10 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్లు జార్ఖండ్ స్టేట్ రెజ్లింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, కోచ్ భాలోనాథ్ సింగ్ చెప్పారు. అలాగే, కేంద్ర క్రీడా శాఖ నుంచి కూడా రూ. 10 లక్షలు ఇప్పించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జడేజాపై మ్యాచ్ నిషేధం... ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌‌లో నం.1 ఆల్‌రౌండర్