Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియో కాంస్య విజేత సాక్షి మాలిక్‌కు నజరానా విడుదల చేసిన కేసీఆర్ సర్కారు

రియో ఒలిపింక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాను విడుదల చేసింది.

Advertiesment
Sakshi Malik
, బుధవారం, 21 సెప్టెంబరు 2016 (10:51 IST)
రియో ఒలిపింక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాను విడుదల చేసింది. 
 
హర్యానాకు చెందిన క్రీడాకారిణి సాక్షి మాలిక్‌‌కు కాంస్య పతకం సాధించిన అనంతరం కోటి రూపాయల పారితోషికం అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గతంలో ప్రకటించినట్టుగా ఆమెకు కోటి రూపాయల నజరానాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కాగా, ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. పీవీ సింధుకు రూ.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వొక్క హిందుస్థానీ అయితే.. పాకిస్థాన్ గురించి ప్రశ్న అడగవు : విలేకరిపై కపిల్ ‌దేవ్ ఆగ్రహం