Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలం పట్టనున్న సానియా మీర్జా.. స్వీయచరితపై పుస్తకం.. జూలైలో రిలీజ్!

Advertiesment
Sania Mirza
, బుధవారం, 4 మే 2016 (17:41 IST)
భారత క్రీడాకారిణి, హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కలం పడుతున్నారు. తండ్రి ఇమ్రాన్ మీర్జా సహకారంతో ‘ఏస్‌ ఎగైనెస్ట్‌ ఆడ్స్‌’ పేరుతో సానియా స్వీయచరితపై పుస్తకం రాస్తోంది. 16 ఏళ్లకే వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ డబుల్స్ టైటిల్స్ గెలిచి, ఇటు సింగిల్స్‌లోనూ.. అటు డబుల్స్‌లోనూ భారత నెంబర్ వన్ క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించుకుంది. 
 
2012లో సింగిల్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సానియా మీర్జా ఆ పై డబుల్స్ విభాగంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సానియా మీర్జా అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకుంది. గత ఏడాది టైటిల్స్‌పై టైటిల్స్ సాధించింది. 
 
హార్పర్‌ కాలిన్స్‌ ప్రచురణ సంస్థ పుస్తకాన్ని జులైలో సానియా మీర్జా స్వయంగా రాసే పుస్తకాన్ని విడుదల చేయనుంది. క్రీడాకారిణిగా ఉన్నత స్థాయికి చేరుకునే క్రమంలో సానియా ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంపై సానియా ఆ పుస్తకంలో పేర్కొంటారని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌‌లో హషీమ్ ఆమ్లా: షాన్ మార్ష్ స్థానంలో బరిలోకి?