Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ : సెమీస్‌లో అడుగుపెట్టిన సానియా జోడీ

sania  mirza
, మంగళవారం, 5 జులై 2022 (10:58 IST)
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ సెమీ ఫైనల్స్‌కు చేరింది. క్రొయేషియాకు చెందిన మేట్ పావిక్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా ఈ పోటీలో తలపడ్డారు. క్వార్టర్ ఫైనల్‌లో తన ప్రత్యర్థిని చిత్తు చేసి సెమీస్‌కు దూసుకొచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో సానియా జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రిలా, జాన్ పీర్స్ జోడీని ఓడించింది. ఇందులో సానియ జోడీ ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన విషయం తెల్సిందే. పైగా, ఇందులో సానియా ఫోర్‌హ్యాండ్ షాట్లతో హోరెత్తించారు. మ్యాచ్ ఆద్యంతం పవర్‌ఫుల్ షాట్స్ అడుతూ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించింది. మరోవైపు, సానియా మీర్జా ఆడే చివరి మిక్స్‌డ్ డబుల్స్ టోర్నీ ఇదే కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనిని గుర్తు చేసిన యాస్తికా.. రెప్పపాటులో షాక్ (Video)