Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేం డ్రగ్స్ తీసుకోలేదు.. మా భోజనంలో ఎవరో కలిపారు : నర్సింగ్ యాదవ్

తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన వార్తలను భారత యువ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తోసిపుచ్చారు. రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత జట్టు తరపున పాల్గొనే అరుదైన అవకాశాన్ని ఈ యవ రెజ్లర్ దక్కించుకున్న విషయం తెల్సిందే

మేం డ్రగ్స్ తీసుకోలేదు.. మా భోజనంలో ఎవరో కలిపారు : నర్సింగ్ యాదవ్
, సోమవారం, 25 జులై 2016 (16:03 IST)
తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన వార్తలను భారత యువ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తోసిపుచ్చారు. రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత జట్టు తరపున పాల్గొనే అరుదైన అవకాశాన్ని ఈ యవ రెజ్లర్ దక్కించుకున్న విషయం తెల్సిందే. 
 
అయితే, నర్సింగ్ యాదవ్ రూమ్మేట్ సందీప్ తులసీ యాదవ్ కూడా డోప్ పరీక్షలో పట్టుబడ్డారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షలో వీరిద్దరూ నిషేధిత ఉత్ర్పేరకం వాడినట్టు తేలింది. అయితే నిషేధిత ఉత్ర్పేరకాలను తాము వాడలేదని నర్సింగ్ యాదవ్, సందీప్ యాదవ్ వాదిస్తున్నారు. 
 
దీనిపై నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ తనపై కుట్ర జరిగిందని, సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశాడు. ఏనాడూ తాను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకోలేదని స్పష్టం చేశాడు. అలాగే, సందీప్ స్పందిస్తూ... భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్, తాను ఒకే రూమ్లో ఉన్నామని, తాము తిన్న ఆహారంలో ఎవరో నిషేధిత ఉత్ప్రేరకాలను కలిపి ఉంటారని భావిస్తున్నట్టు సందేహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో మహిళతో సెక్స్‌లో పాల్గొన్న ఫుట్‌బాల్ ఆటగాడు.. ఇంటర్నెట్‌లో వీడియో!