Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ ఒక్కటికానున్న సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్

Advertiesment
saina nehwal

ఠాగూర్

, ఆదివారం, 3 ఆగస్టు 2025 (09:00 IST)
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్‌లు మళ్లీ ఒక్కటికానున్నారు. ఇటీవల తన భర్త పారుపల్లి కశ్యప్‌తో విడిపోతున్నట్టు ఆమె ప్రకటించారు. 35 యేళ్ల సైనా నెహ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కశ్యప్‍తో కలిసివున్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ కొన్నిసార్లు దూరం, సాన్నిహిత్యం విలువను నేర్పుతుంది. మేను ఇపుడు మళ్లీ ప్రయత్నిస్తున్నాం అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వారి అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని ఆనందంలో ముంచెత్తింది. 
 
తన భర్త కశ్యప్‌తో విడిపోతున్నట్టు సైనా నెహ్వాల్ గత నెలలో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2018లో వివాహం చేసుకున్న ఈ జంట ఆరు సంవత్సరాలకు పైగా కలిసి జీవించారు. కొన్నిసార్లు జీవితం మమల్ని వేర్వేరు దిశల్లో నడిపిస్తుంది. బాగా ఆలోచించిన తర్వాత మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని సైనా గతంలో తన ఇన్‌స్టా పేజీలో రాసుకొచ్చారు. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరూ హైదరాబాద్ నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడెమీలో తమ బ్యాడ్మింటన్ క్రీడా కెరీర్‌ను నిర్మించుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

WCL: ప్రైవేట్ క్రికెట్ లీగ్‌లలో పాకిస్థాన్ పేరును ఉపయోగించడం నిషేధం.. పీసీబీ సీరియస్