పార ఒలింపిక్ విజేత దీపా మాలిక్కు రూ.4 కోట్లు.. ఉద్యోగం : హర్యానా ప్రభుత్వం
పారా ఒలింపిక్స్లో షాట్పుట్లో రజత పతకం సాధించిన దీపా మాలిక్పై హర్యానా ప్రభుత్వం కాసుల వర్షం కురిపించింది. ఆమెకు రూ.4 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు శనివారం హర్యానా క్రీడలు, యువజనశా
పారా ఒలింపిక్స్లో షాట్పుట్లో రజత పతకం సాధించిన దీపా మాలిక్పై హర్యానా ప్రభుత్వం కాసుల వర్షం కురిపించింది. ఆమెకు రూ.4 కోట్ల నగదుతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు శనివారం హర్యానా క్రీడలు, యువజనశాఖా మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు.
రియో నుంచి న్యూఢిల్లీ చేరుకున్న ఆమెకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో మంత్రి సాదరస్వాగతం పలికారు. పారా ఒలింపిక్లో హర్యానా క్రీడాకారిణి పతకం సాధించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆమె విద్యార్హతలకు తగ్గ ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు.
హర్యానాలోని సోనిపట్కు చెందిన దీపా మలిక్(45) పారా ఒలింపిక్స్లో పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. స్పైనల్ ట్యూమర్ కారణంగా 1999 నుంచి దీప వీల్చైర్కు పరిమితమైంది. అయినప్పటికీ పోరాట పటిమ ప్రదర్శించి పతకం కైవసం చేసుకుంది.