Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియో ఒలింపిక్స్ : సానియా - బోపన్న జోడీ శుభారంభం

రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ శుభారంభం చేసింది. ఈ విశ్వక్రీడల్లో భాగంగా గురువారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్ టోర్నీ తొలి రౌండ్‌లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్న

Advertiesment
Rio Olympics
, శుక్రవారం, 12 ఆగస్టు 2016 (08:35 IST)
రియో ఒలింపిక్స్ పోటీల్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ శుభారంభం చేసింది. ఈ విశ్వక్రీడల్లో భాగంగా గురువారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్ టోర్నీ తొలి రౌండ్‌లో సానియా మీర్జా, రోహన్‌ బోపన్న జోడీ... ఆస్ట్రేలియాకు చెందిన సమంత స్టోసర్‌, పీర్స్‌ జాన్‌ జంటపై విజయం సాధించింది. 
 
7-5, 6-4 తేడాతో వరుస సెట్లతో ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో సానియా-బోపన్న జోడీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరారు. కాగా, రియో ఒలింపిక్స్‌ నుంచి భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ (పురుషుల సింగిల్స్), మహిళల డబుల్స్ విభాగంలో సానియా జోడీ నిష్క్రమించగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సానియా జోడీ విజయం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్ఫింగ్ చేస్తుండగా అగ్నిపర్వతం బద్ధలైంది... ఆమె ఎలా తప్పించుకుందో చూడండి (థ్రిల్లింగ్ వీడియో)