Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి..

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో భారత పోరు ముగిసింది. భారత షట్లర్లు పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే చైనాకు చెందిన అన్‌సీడెడ

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి..
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (10:00 IST)
మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో భారత పోరు ముగిసింది. భారత షట్లర్లు పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే చైనాకు చెందిన అన్‌సీడెడ్‌ చెన్‌ యుఫీ 18-21, 21-19, 21-17 స్కోరుతో సింధూపై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన అకనే యమగుచి 19-21, 21-13, 21-15 స్కోరుతో సైనా నెహ్వాల్‌పై సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది.
 
అయితే మలేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత క్రీడాకారుడు అజయ్‌ జయరామ్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన కియో బిన్‌పై 21-11, 21-8 వరస సెట్లలో సునాయసంగా గెలుపొందాడు. కేవలం 31 నిమిషాల్లోనే జయరామ్ మ్యాచ్‌ను ముగించాడు. 
 
కాగా, పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత జోడి ఓటమి పాలైంది. మను అత్రి-సుమిత్‌ రెడ్డి జోడీపై 18-21, 21-18, 21-17 స్కోరుతో చైనీస్‌ తైపీకి చెందిన లియో కౌన్‌ హు-లు చియా పిన్‌ జోడీ గెలుపొందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ లాంటి క్రికెటర్ జట్టులో ఉండటం కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు అదృష్టం: రవిశాస్త్రి