Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిల్వర్ సింధూపై కాసుల వర్షం... కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా..

రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు వెండి పతకాన్ని సాధించి పెట్టిన తెలుగమ్మాయి, భారత షట్లర్ పివి సింధుపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించగా, ఢిల

సిల్వర్ సింధూపై కాసుల వర్షం... కోచ్ పుల్లెల గోపీచంద్‌కు కూడా..
, శనివారం, 20 ఆగస్టు 2016 (11:18 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు వెండి పతకాన్ని సాధించి పెట్టిన తెలుగమ్మాయి, భారత షట్లర్ పివి సింధుపై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించగా, ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆమెకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చింది. 
 
ఒలింపిక్స్లో రజతం సాధించినందుకుగాను రెండు కోట్ల రూపాయిల నజరానాను ఇస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే, మహిళల రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్కు కోటి రూపాయిలను ఇవ్వనున్నట్లు తెలిపింది. 
 
అలాగే, భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల రివార్డును సింధుకు ప్రకటించింది. 
 
కాగా, ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్లో సింధు  21-19, 12-21, 15-21తో టాప్ సీడ్ స్పెయిన్ క్రీడాకారిణి కరోలిన్ మరిన్ చేతిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్న విషయం తెల్సిందే. దీంతో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఏదోక రోజు ఆమెను సింధు ఓడిస్తుంది'... పుల్లెల గోపీచంద్