Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రొ కబడ్డీ లీగ్: ముంబైకి నిరాశ.. సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న పుణె!

ప్రొ కబడ్డీ లీగ్ పోటీల్లో భాగంగా పుణె జట్టు సత్తా చాటింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 36-33తో బెంగళూరు బుల్స్‌పై పుణెరి పల్టన్ సత్తా చాటింది. దీంతో నాకౌట్ వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ

ప్రొ కబడ్డీ లీగ్: ముంబైకి నిరాశ.. సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న పుణె!
, గురువారం, 28 జులై 2016 (14:58 IST)
ప్రొ కబడ్డీ లీగ్ పోటీల్లో భాగంగా పుణె జట్టు సత్తా చాటింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 36-33తో బెంగళూరు బుల్స్‌పై పుణెరి పల్టన్ సత్తా చాటింది. దీంతో నాకౌట్ వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పూణే విజయం సాధించడంతో పాటు సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో ట్యాక్లింగ్‌లో మంజిత్ చిల్లర్ (11), రైడింగ్‌లో దీపక్ నివాస్ హుడా (9) ధీటుగా రాణించారు. వీరిద్దరూ ఆద్యంతం మెరుగ్గా రాణించడంతో సెమీస్ బెర్తును సొంతం చేసుకున్నట్లైంది. 
 
మరో మ్యాచ్‌లో యు ముంబా 38-34తో దబంగ్ ఢిల్లీపై గెలుపొందినా సెమీస్ బెర్తును ఖరారు చేసుకోలేకపోయింది. 42 పాయింట్లతో ఇరు జట్లు సమ ఉజ్జీవులుగా ఉన్నప్పటికీ.. ముంబై (18) స్కోరు ఓవరాల్‌గా పుణె (23) కంటే తక్కువగా ఉండటంతో పుణెకే సెమీస్ బెర్తు ఖాయమైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కింగ్‌స్టన్ చేరుకున్న భారత క్రికెట్ జట్టు.. వీడియో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్...