6 నెలల క్రితమే వివాహం.. కబడ్డీ క్రీడాకారుడు రోహిత్ కుమార్ భార్య ఆత్మహత్య ఎందుకు?
ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్న వేళ.. జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు రోహిత్ కుమార్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ ఢిల్లీ నాన్ గోలాయిలోని రోహిత్ కుమార్ నివాసంలో ఆయన భార్
ప్రపంచ కప్ కబడ్డీ పోటీల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్న వేళ.. జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు రోహిత్ కుమార్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ ఢిల్లీ నాన్ గోలాయిలోని రోహిత్ కుమార్ నివాసంలో ఆయన భార్య లలిత (27) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు చెప్పారు. కాగా, సుమారు 6 నెలల క్రితం రోహిత్-లలిత వివాహం జరిగింది. ప్రోకబడ్డీ లీగ్ పట్నా పైరేట్స్ జట్టు సభ్యుడిగా రోహిత్ ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
లలిత మృతి కేసును డౌరీ కేసు కింద నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రోహిత్ కుమార్ ఫ్యామిలీ పరారీలో ఉందని.. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీస్ కమిషనర్ విజయ్ వెల్లడించారు. రోహిత్ కుమార్ వరకట్నం తేవాలని వేధించడంతోనే లలిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.