మాజీ ప్రియురాలిపై అత్యాచారం కేసులో భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్కు ఊరట
మాజీ ప్రియురాలిపై అత్యాచారం చేశాడన్న కేసులో భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్కు ఊరట లభించింది. కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే, ట్రయల్ కోర్టు విచారణకు
మాజీ ప్రియురాలిపై అత్యాచారం చేశాడన్న కేసులో భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్కు ఊరట లభించింది. కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే, ట్రయల్ కోర్టు విచారణకు ఆదేశించిందని... ఈ కారణంగా విచారణపై స్టే విధించాలని కోరుతూ సర్దార్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై సర్దార్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఇంగ్లండ్కు చెందిన అండర్ 19 హాకీ మాజీ ప్లేయర్ అష్పాల్ కౌర్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్సువల్ హరాస్ మెంట్, శారీరకంగా, మానసికంగా హింసించడంలాంటి ఆరోపణలను ఫిర్యాదులో ఆమె పేర్కొంది.